
కావాల్సిన పదార్ధాలు : 200 గ్రాముల పల్లీలు, 50 గ్రాములు పచ్చి మిర్చి, పావు కిలో టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయంత చింతపండు, నూనెను తీసుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో పచ్చి మిర్చి, టమాటాలు వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత దీనిలో చింత పండును వేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

అయితే రోటిలో కానీ, మిక్సీలో కానీ వేయించిన పల్లీలు, మగ్గించిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పును కూడా బాగా రుబ్బుకోవాలి.

స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి, అది వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు , అర కప్పు ఎండు మిర్చిని వేసి వాటిని బాగా వేయించాలి. ఈ పోపును తీసుకుని టమాటాలు పల్లీల పచ్చడిలో వేసి గరిటేతో మిక్స్ అయ్యేలా కలపాలి.

టమాటాలు పల్లీల పచ్చడి బాగా టేస్టీగా ఉండాలంటే దానిలో వెల్లుల్లి రెబ్బలు తినడానికి టేస్టీగా ఉంటుంది. చట్నీ గట్టిగా ఉండాలంటే నీరు పోయకుండా ఉంటే చాలు. ఇలా చేస్తే ఒక దోసె తినే వాళ్ళు రెండు ప్లేట్స్ తింటారు