
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కానీ, అరటి పండుతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పండ్లను కలిపి తినకూడదని మీకు తెలుసా.. ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

బొప్పాయి, అరటిపండు కలిపి తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు పండ్లు భిన్నమైన స్వభావాలు కలిగి ఉండడం వల్ల దీన్ని హానికరమైన ఫ్రూట్ కాంబినేషన్ అంటున్నారు. అందుకే ఇలా తినకపోవడమే మంచిదంటున్నారు.

అరటి పండు, బొప్పాయి కలిపి తినటం వల్ల వాంతులు, తలనొప్పి, వికారం, అసెడిటీ, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల ఆ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.