
చాలా మంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఏది తినాలన్నా భయపడుతుంటారు. ఇది ప్రధానంగా ఫుడ్ పాయిజనింగ్ కోసం. కానీ పదేపదే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

లేదంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడే ఆహారాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు.

అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..మీకెప్పుడైనా కడుపు నొప్పి సమస్య తలెత్తితే వెంటనే నిమ్మకాయ రసం తాగండి. గ్లాసు నీళ్లలో నిమ్మరసం, చక్కెర కలుపుకుని తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తినవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ని వేడి నీటిలో కలిపి తీసుకుంటే బాగా పని చేస్తుంది. ఇది మీకు కడుపునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎక్కువ సార్లు విరేచనాలు అయితే శరీరంలో పొటాషియం లోపం తలెత్తుతుంది. శరీరంలో తగినంత లేకపోతే ఆరోగ్యం బలహీనంగా మారుతుంది.

ఇలాంటి సందర్బాల్లో వెల్లుల్లిని కూడా తినవచ్చు. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నోట్లో ఓ వెల్లుల్లి రెబ్బ వేసుకుని గోరువెచ్చని నీళ్లతో నమిలి మింగండి. ఇలా చేయడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.