Diabetes: భారతదేశంలో గత 4 సంవత్సరాలలో మధుమేహం 44 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే డయాబెటీస్ పేషంట్లలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుంటే అది ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో బ్లడ్ షుగర్ని నియంత్రించేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్ని రకాల పదార్థాలను తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి: ఉసిరికి ఆయుర్వేదంలో అత్యంత ప్రముఖమైనవి. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో ఎంతో ఉపయోగకరం. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తాయి.
తిప్పతీగ: మధుమేహంతో బాధపడేవారికి తిప్ప తీగ ఎంతో ప్రయోజనకరం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బులు , ఊబకాయం, ప్రేగు వ్యాధులు, కీళ్లనొప్పులు, అల్జీమర్స్ వంటి సమస్యలను నిరోధిస్తాయి.
నేరేడు కాయ: నేరేడులోని హైపో-గ్లైసెమిక్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా నేరేడు పండ్లలో ఉన్న ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా బ్లడ్ షుగర్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
కాకరకాయ: ఆయుర్వేదంలో కాకరకాయకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా షుగర్ వ్యాధికి ఇది ఒక దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల కాకరకాయ డయాబెటీస్ పేషంట్ల డైట్లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.