T20 World Cup 2021 Semi Finals: పాకిస్తాన్ తరువాత సెమీస్ చేరే జట్టేదో తెలుసా? గ్రూపు2 లో ఆ రెండు టీంలపై నెలకొన్న ఉత్కంఠ..!

|

Nov 03, 2021 | 2:36 PM

ICC T20 World Cup 2021: నమీబియాను ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్న తొలి జట్టుగా పాకిస్తాన్ టీం నిలిచింది.

1 / 5
ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్‌ 2021లో మొదటి సెమీ-ఫైనలిస్ట్ జాబితా సిద్ధమైంది. మంగళవారం జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నమీబియాను ఓడించి చివరి-4లో చేరి ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూప్ 2 నుంచి మరో జట్టు అర్హత సాధించాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ కూడా ఉంది. ఈ గ్రూప్‌లోని మిగిలిన జట్ల క్వాలిఫికేషన్ ఏ స్థాయిలో ఉందో ఓసారి చూద్దాం.

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్‌ 2021లో మొదటి సెమీ-ఫైనలిస్ట్ జాబితా సిద్ధమైంది. మంగళవారం జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నమీబియాను ఓడించి చివరి-4లో చేరి ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూప్ 2 నుంచి మరో జట్టు అర్హత సాధించాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ కూడా ఉంది. ఈ గ్రూప్‌లోని మిగిలిన జట్ల క్వాలిఫికేషన్ ఏ స్థాయిలో ఉందో ఓసారి చూద్దాం.

2 / 5
పాకిస్థాన్ తర్వాత గ్రూప్-2లో న్యూజిలాండ్ స్థానం చాలా బాగుంది. నాకౌట్ రౌండ్‌లకు చేరిన అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సులువుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో ఓడిపోయి, ఆ తర్వాత కివీ జట్టు స్కాట్‌లాండ్‌, నమీబియాపై గెలుపొందితే ఆరు పాయింట్లు ఉంటాయి. అలాగే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే ఇరు జట్లకు చెరో ఆరు పాయింట్లు వస్తాయి. అలాంటప్పుడు నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఈ రెండు జట్లలో ఏదో ఓకటి సెమీ ఫైనల్ చేరుకుంటుంది. ఇప్పటి వరకు భారత్,  కంటే ఆఫ్ఘనిస్థాన్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. భారత్ నెట్ రన్ రేట్ -1.609 కాగా, న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ 0.765 గా ఉంది. న్యూజిలాండ్ జట్టు స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘనిస్థాన్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది.

పాకిస్థాన్ తర్వాత గ్రూప్-2లో న్యూజిలాండ్ స్థానం చాలా బాగుంది. నాకౌట్ రౌండ్‌లకు చేరిన అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సులువుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో ఓడిపోయి, ఆ తర్వాత కివీ జట్టు స్కాట్‌లాండ్‌, నమీబియాపై గెలుపొందితే ఆరు పాయింట్లు ఉంటాయి. అలాగే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే ఇరు జట్లకు చెరో ఆరు పాయింట్లు వస్తాయి. అలాంటప్పుడు నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఈ రెండు జట్లలో ఏదో ఓకటి సెమీ ఫైనల్ చేరుకుంటుంది. ఇప్పటి వరకు భారత్, కంటే ఆఫ్ఘనిస్థాన్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. భారత్ నెట్ రన్ రేట్ -1.609 కాగా, న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ 0.765 గా ఉంది. న్యూజిలాండ్ జట్టు స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘనిస్థాన్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది.

3 / 5
స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఈ రెండు జట్లను భారీ తేడాతో ఓడించడంతో నెట్ రన్ రేట్‌ విషయంతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం నవంబర్ 7న న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. భారత్ చేతిలో ఓడినా.. నెట్ రన్ రేట్ పై ప్రభావం చూపకపోవడంతో పర్వాలేదు. కానీ.. న్యూజిలాండ్‌ను మాత్రం ఓడించాల్సి ఉంటుంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్, భారత్, న్యూజిలాండ్ రెండింటినీ ఓడించినట్లయితే, మధ్యలో నెట్ రన్ రేట్ రాకుండా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.

స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఈ రెండు జట్లను భారీ తేడాతో ఓడించడంతో నెట్ రన్ రేట్‌ విషయంతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం నవంబర్ 7న న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. భారత్ చేతిలో ఓడినా.. నెట్ రన్ రేట్ పై ప్రభావం చూపకపోవడంతో పర్వాలేదు. కానీ.. న్యూజిలాండ్‌ను మాత్రం ఓడించాల్సి ఉంటుంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్, భారత్, న్యూజిలాండ్ రెండింటినీ ఓడించినట్లయితే, మధ్యలో నెట్ రన్ రేట్ రాకుండా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.

4 / 5
తొలి విజయం కోసం భారత్ ఇంకా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడి, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు కోహ్లీసేన ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే రెండు పరాజయాల తర్వాత భారత్ భవితవ్యం తమ చేతిలో లేకుండా చేసుకుంది. ‎ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లు గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా మూడు మ్యాచ్‌లు గెలిస్తే, అప్పుడు భారత జట్టు ఆటోమేటిక్‌గా సెమీస్ నుంచి ఔట్ అవుతుంది. న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించి, ఆ తర్వాత భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే భారత్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అన్ని జట్లు ఆరు పాయింట్లపై ఉంటాయి. ఆపై నెట్ రన్ రేట్‌తో సెమీస్ చేరే జట్టు నిర్ణయించబడుతుంది.

తొలి విజయం కోసం భారత్ ఇంకా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడి, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు కోహ్లీసేన ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే రెండు పరాజయాల తర్వాత భారత్ భవితవ్యం తమ చేతిలో లేకుండా చేసుకుంది. ‎ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లు గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా మూడు మ్యాచ్‌లు గెలిస్తే, అప్పుడు భారత జట్టు ఆటోమేటిక్‌గా సెమీస్ నుంచి ఔట్ అవుతుంది. న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించి, ఆ తర్వాత భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే భారత్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అన్ని జట్లు ఆరు పాయింట్లపై ఉంటాయి. ఆపై నెట్ రన్ రేట్‌తో సెమీస్ చేరే జట్టు నిర్ణయించబడుతుంది.

5 / 5
నమీబియా, స్కాట్‌లాండ్‌లు తలో రెండు పరాజయాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు జట్లూ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా అర్హత సాధిస్తేనే అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం, స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ -3.562, నమీబియా నెట్ రన్ రేట్ -1.599 గా ఉంది. రన్ రేట్ మెరుగుపడాలంటే మిగతా మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు.

నమీబియా, స్కాట్‌లాండ్‌లు తలో రెండు పరాజయాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు జట్లూ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా అర్హత సాధిస్తేనే అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం, స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ -3.562, నమీబియా నెట్ రన్ రేట్ -1.599 గా ఉంది. రన్ రేట్ మెరుగుపడాలంటే మిగతా మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు.