
త కొన్నినెలలుగా అవిశ్రాంతంగా మ్యాచ్లు ఆడుతోన్న టీమిండియా లేటెస్ట్ సెన్షేషన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ టూర్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.

దొరికిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ కోసం వెచ్చిస్తున్నాడు మిస్టర్ 360. తాజాగా తన భార్యతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు సూర్యకుమార్.

ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ డిజైనర్ కుర్తా, పైజామాతో స్టైలిష్గా మెరిసిపోయారు. ఇక అతని భార్య దేవిషా రెడ్ డ్రెస్లో అందంగా ముస్తాబైంది. ఇద్దరూ తమ తమ డ్రెస్సుల్లో డాషింగ్గా కనిపిస్తున్నారు.

విశ్రాంతి పేరుతో సూర్యకుమార్ యాదవ్ను బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ మైదానంలో దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నుంచి ముంబైకి అందుబాటులో ఉంటాడు.

సూర్యకుమార్ టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. . అతను ఇప్పుడు టీ20లో నంబర్ వన్ బ్యాటర్గా కూడా ఉన్నాడు.