
సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బుధవారం (మార్చి 27) రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. తద్వారా ఈ సీజన్ లో మొదటి విజయాన్ని చవి చూసింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. క్లాసెన్ (80నాటౌట్), అభిషేక్ (63), హెడ్ (62), మార్క్రమ్ (42 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూడా ధాటిగానే ఆడింది. ముఖ్యంగా తెలుగబ్బాయి తిలక్ వర్మ ( 34 బంతుల్లో 64) చెలరేగాడు

టిమ్ డేవిడ్ (42), ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) వేగంగా పరుగులు చేసినా లక్ష్యం మరీ పెద్దదైపోయింది. దీంతో ముంబైకు ఓటమి తప్పలేదు.

హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్,జయదేవ్ ఉనద్కత్ తలో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ సీజన్ లో ముంబైకు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.