
IND vs AUS 2nd ODI: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడమే కాక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ తరఫున శుభమాన్ గిల్(104), శ్రేయాస్ అయ్యర్(105) సెంచరీలతో రాణించారు.

వీరిద్దరూ వ్యక్తిగత సెంచరీలతోనే కాక రెండో వికెట్కి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో నాల్గో అత్యధిక భాగస్వామ్యం అందించిన భారత జోడిగా గిల్-అయ్యర్ నిలిచారు.

గతంలో ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్- వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. సచిన్-లక్ష్మణ్ జోడీ ఇండోర్ వేదికగానే 2001లో ఆసీస్పై 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కాగా, ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీవీఎస్ లక్ష్మణ్-యువరాజ్ సింగ్ జోడీ అగ్రస్థానంలో ఉంది. ఈ జోడీ 2004లో 213 పరుగులు చేసింది.

అలాగే ఈ లిస్టు రెండో స్థానంలో విరాట్ కోహ్లీ-శిఖర్ ధావన్ (2016లో 212 రన్స్).. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ(2016లో 207) జోడీలు ఉన్నాయి.