వైజాగ్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 03) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో KKR విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ కనిపించిన ఓ మహిళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకీ ఆ మహిళ ఎవరో, షారుఖ్ తో రిలేషన్ ఏంటో తెలుసుకుందాం రండి.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్తో పాటు కేకేఆర్ను ఉత్సాహపరిచేందుక వచ్చిన మహిళ పేరు పూజా దద్లానీ. ఆమె గత 11-12 ఏళ్లుగా షారుఖ్ ఖాన్ మేనేజర్ గా వ్యవహరిస్తోంది.
ఢిల్లీ vs KKR మ్యాచ్ సందర్భంగా పూజా దద్లానీ షారుక్తో కలిసి స్టేడియంలో సందడి చేసింది. దీంతో పూజా, షారుఖ్ల ఫోటోలు వైరల్గా మారాయి.
ఇన్స్టాగ్రామ్లో షారుక్కు 47 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. షారుక్ మాత్రం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతారు. ఆ 7 మందిలో పూజ ఒకరు. మీడియా కథనాల ప్రకారం పూజా పారితోషికం దాదాపు 7-8 కోట్లు
పూజా దద్లానీ హితేష్ గుర్నానీని 2008లో పెళ్లి చేసుకుంది. వీరికి రైనా అనే బిడ్డ ఉంది. పూజా సుమారు 12 ఏళ్లుగా షారుక్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది.