AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: జడేజా నిరీక్షణ ముగిసింది.. ‘డబుల్‌ సెంచరీ’ తర్వాత కెప్టెన్ అయ్యాడు..

IPL 2022: IPL 2022 సీజన్‌తో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్‌లో మరో ఘనత చేరింది. తన సుదీర్ఘ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించని రవీంద్ర జడేజా ప్రస్తుతం

uppula Raju
|

Updated on: Mar 27, 2022 | 6:00 AM

Share
 IPL 2022 సీజన్‌తో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్‌లో మరో ఘనత చేరింది. తన సుదీర్ఘ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించని రవీంద్ర జడేజా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ అయ్యాడు. మార్చి 26 శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన IPL 2022 మొదటి మ్యాచ్‌లో జడేజా తొలిసారి కెప్టెన్‌గా మైదానంలోకి దిగాడు. దీంతో పాటు రికార్డు కూడా సృష్టించాడు.

IPL 2022 సీజన్‌తో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్‌లో మరో ఘనత చేరింది. తన సుదీర్ఘ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించని రవీంద్ర జడేజా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ అయ్యాడు. మార్చి 26 శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన IPL 2022 మొదటి మ్యాచ్‌లో జడేజా తొలిసారి కెప్టెన్‌గా మైదానంలోకి దిగాడు. దీంతో పాటు రికార్డు కూడా సృష్టించాడు.

1 / 4
తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ముందు రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధించాడు. CSK డాషింగ్ ఆల్ రౌండర్ చాలా మ్యాచ్‌ల తర్వాత IPLకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు అయ్యాడు. జడ్డూ 200 మ్యాచ్‌లు ఆడిన తర్వాత తొలిసారిగా జట్టు బాధ్యతలు చేపట్టాడు.

తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ముందు రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధించాడు. CSK డాషింగ్ ఆల్ రౌండర్ చాలా మ్యాచ్‌ల తర్వాత IPLకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు అయ్యాడు. జడ్డూ 200 మ్యాచ్‌లు ఆడిన తర్వాత తొలిసారిగా జట్టు బాధ్యతలు చేపట్టాడు.

2 / 4
ఈ విషయంలో భారత బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు. SRH కెప్టెన్సీకి ముందు మనీష్ 153 మ్యాచ్‌లు ఆడాడు.

ఈ విషయంలో భారత బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు. SRH కెప్టెన్సీకి ముందు మనీష్ 153 మ్యాచ్‌లు ఆడాడు.

3 / 4
 అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో జడేజా అంతగా ఆడలేదు. కేకేఆర్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యుత్తమంగా 50 పరుగులు చేశాడు. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో జడేజా అంతగా ఆడలేదు. కేకేఆర్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యుత్తమంగా 50 పరుగులు చేశాడు. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

4 / 4