2017 నుంచి వెస్టిండీస్తో జరిగిన ఏ సిరీస్ను టీమిండియా కోల్పోలేదు. వెస్టిండీస్తో వరుసగా నాలుగో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. అలాగే టీ20ల్లో భారత్ తన 100వ విజయాన్ని నమోదు చేసింది.
వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్లో 1-0తో టీమిండియాను ఓడించింది. దీని తర్వాత భారత్తో జరిగిన టీ20 సిరీస్ను విండీస్ ఎప్పుడూ గెలవలేకపోయింది. ప్రస్తుత సిరీస్లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఫిబ్రవరి 20న జరగనుంది.
రెండో టీ20లో ఆడిన కీరన్ పొలార్డ్కి ఇది 100వ టీ20 మ్యాచ్. పొలార్డ్ ప్రపంచంలో 9వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే వెస్టిండీస్ నుంచి 100 టీ20ఐ మ్యాచ్లు ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.