AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు..!

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ చివరి టెస్ట్ మ్యాచ్ రద్దైంది.

Venkata Chari
|

Updated on: Sep 11, 2021 | 8:50 AM

Share
కరోనా కారణంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సిరీస్ ఫలితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో, ఇంగ్లండ్ మీడియా భారతదేశాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ మొత్తం వివాదం ఆగస్టు 31 నుంచి మొదలైందని పేర్కొంది.

కరోనా కారణంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సిరీస్ ఫలితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో, ఇంగ్లండ్ మీడియా భారతదేశాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ మొత్తం వివాదం ఆగస్టు 31 నుంచి మొదలైందని పేర్కొంది.

1 / 5
గత వారం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ,  జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి లండన్‌లో జరిగిన పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని శాస్త్రి స్వయంగా రాశారు. ఈ ఇద్దరితో పాటు, కోచింగ్ సిబ్బందిలోని మరికొందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత వారం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి లండన్‌లో జరిగిన పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని శాస్త్రి స్వయంగా రాశారు. ఈ ఇద్దరితో పాటు, కోచింగ్ సిబ్బందిలోని మరికొందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2 / 5
సెప్టెంబర్ 5 న, శాస్త్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. మరుసటి రోజు RT-PCR పరీక్షను నిర్వహించగా, అందులోనూ పాజిటివ్ అని తేలింది. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబరు 7 న శాస్త్రి, కోహ్లీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లడంతో బిసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారిద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలిసింది.

సెప్టెంబర్ 5 న, శాస్త్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. మరుసటి రోజు RT-PCR పరీక్షను నిర్వహించగా, అందులోనూ పాజిటివ్ అని తేలింది. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబరు 7 న శాస్త్రి, కోహ్లీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లడంతో బిసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారిద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలిసింది.

3 / 5
సెప్టెంబర్ 9 న, టీమిండియా సహాయక సిబ్బందిలోని మరొక సభ్యుడు - అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించారు. దీని తర్వాత రెండు జట్ల క్రికెట్ బోర్డుల సమావేశం జరిగింది. భారత జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయడంతో హోటల్ గదులకే పరిమితం అయ్యారు.

సెప్టెంబర్ 9 న, టీమిండియా సహాయక సిబ్బందిలోని మరొక సభ్యుడు - అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించారు. దీని తర్వాత రెండు జట్ల క్రికెట్ బోర్డుల సమావేశం జరిగింది. భారత జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయడంతో హోటల్ గదులకే పరిమితం అయ్యారు.

4 / 5
అంతకుముందు సెప్టెంబర్ 10న ఉదయం, మ్యాచ్ మొదటి రోజు ఆటను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు వెలువడ్డాయి. అనంతరం మధ్యాహ్నానికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రెండు బోర్డులు ప్రకటించాయి.

అంతకుముందు సెప్టెంబర్ 10న ఉదయం, మ్యాచ్ మొదటి రోజు ఆటను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు వెలువడ్డాయి. అనంతరం మధ్యాహ్నానికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రెండు బోర్డులు ప్రకటించాయి.

5 / 5
Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్