
పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో పాకిస్థాన్ను ఓడించడంలో యువ బౌలర్ నహిద్ రానా కీలక పాత్ర పోషించాడు.

భారత్తో సిరీస్కు బాగానే సిద్ధమయ్యాం. సాధన బాగానే ప్రారంభించాం. భారత జట్టు చాలా బాగుందని, అయితే బాగా ఆడే జట్టు గెలుస్తుందని నహిద్ రానా అన్నాడు.

నేను స్పెషల్గా ఓ వేగాన్ని సెట్ చేయలేదు. జట్టు వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఫలానా బౌలర్ని అనుసరించను. అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను.

బంగ్లాదేశ్తో టెస్టుకు టీమిండియా జట్టు:- రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.