
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్- ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది.

ఈ మ్యాచ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారత్ - ఆసీస్ దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా నాలుగో టెస్టు మ్యాచ్కు నరేంద్ర మోడీ, ఆంథోనీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్టేడియంలోని విశేషాలను మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీకి రవిశాస్త్రి వివరించి చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆస్ట్రేలియా ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. అలాగే బీసీసీఐ కార్యదర్శి జైషా చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు