
జోహన్నెస్బర్గ్ టెస్టులో తొలి రోజు భారత జట్టుకు అనుకున్నంత బాగోలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడటంతో మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆ జట్టు బ్యాటింగ్ కూడా గాడి తప్పడంతో తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. అలాగే ఆట ముగిసే సమయానికి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా తన ఓవర్లో గాయపడి మైదానం వీడడం టీమ్ ఇండియాకు కొత్త తలనొప్పిగా మారింది.

తొలిరోజు చివరి సెషన్లో టీమ్ ఇండియా బౌలింగ్ సాగుతోంది. ఆట ముగిసేందుకు మరో 7 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ఓవర్ కొనసాగుతుండగా, అతను చివరి బంతికి రౌండ్ ది వికెట్ పరుగెత్తడం ప్రారంభించాడు. కానీ, బంతిని విడుదల చేసే సమయం రాగానే స్టంప్ల దగ్గరికి కుడి తొడ పట్టుకుని బాధపడడం కనిపించింది.

సిరాజ్ పరిస్థితిని చూసిన టీమ్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే మైదానానికి చేరుకుని సిరాజ్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. రోజు ఆట ముగియనుంది. కాబట్టి ఫిజియో సిరాజ్ను మైదానంలో తనిఖీ చేయకుండా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, సిరాజ్ గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, సిరాజ్ను చూడగానే అతని తొడలో ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదే నిజమైతే భారత జట్టు మరింత ఇబ్బందుల్లోకి కూరుకపోనుంది. స్నాయువు సమస్య నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, గాయం తీవ్రంగా మారితే, ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా తమ స్టార్ బౌలర్ లేకుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫీల్డ్ నుంచి బయలుదేరే ముందు, సిరాజ్ కేవలం 3.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులో 2 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. 4 పరుగులు ఇచ్చాడు. అతను దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ, వికెట్ తీయలేకపోయాడు. తొలి టెస్టులో సిరాజ్ 3 వికెట్లు తీశాడు.