
ఆదివారం దుబాయ్లో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, తొలి ఓవర్లోనే టీమిండియా స్టార పేసర్ విసుగెత్తించాడు. దీంతో ఓ చెత్త రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్లో భారత బౌలర్ మహమ్మద్ షమీ అత్యధిక ఓవర్ వేసిన అవాంఛిత రికార్డును నమోదు చేశాడు.

కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ, షమీ 11 బంతుల ఓవర్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. వాటిలో ఐదు వైడ్ల నుంచి వచ్చాయి. అతను తన స్వింగ్ను నియంత్రించడానికి, తన లైన్ను నిలబెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.

జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత వన్డేల్లో 11 బంతుల ఓవర్ వేసిన మూడవ భారతీయుడిగా అతను నిలిచాడు. జహీర్ ఆరు సందర్భాలలో 10 బంతుల ఓవర్లు బౌలింగ్ చేశాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో షమీ వేసిన ఓవర్ మూడోది. బంగ్లాదేశ్కు చెందిన హసిబుల్ హొస్సేన్, జింబాబ్వేకు చెందిన తినాషే పన్యాంగర ఈ పోటీలో అత్యధిక ఓవర్లు వేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు 13 బంతులతో ఓవర్లు వేశారు.

ప్రస్తుతం వార్త రాసే వరకు పాకిస్తాన్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. బాబర్ ఆజం 23, ఇమామ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే, షమీ బౌలింగ్ చేసుకుందు ఇబ్బంది పడడంతో తన మూడో ఓవర్ ముగిశాక, పెవలియన్ చేరాడు.