
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. దీంతో నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది.

అలాగే, ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ శర్మ సౌరవ్ గంగూలీ 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా 10 మ్యాచ్లు గెలిచింది. భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు.

20 ఏళ్ల క్రితం సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 2003 వన్డే ప్రపంచకప్లో టీమిండియా 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పుడు గంగూలీ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.

వన్డే ప్రపంచకప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు 2003, 2007 ప్రపంచకప్లలో రెండు సార్లు వరుసగా 11 మ్యాచ్లు గెలిచింది.

రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఈ ఎడిషన్లో 10 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 2003 ప్రపంచకప్లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచింది.

ఈ రెండు జట్ల తర్వా శ్రీలంక 2007 ప్రపంచకప్లో వరుసగా 8 మ్యాచ్లు గెలుపొందగా, 2015 ప్రపంచకప్లో న్యూజిలాండ్ కూడా వరుసగా 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది.