AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC: ఐసీసీ కీలక నిర్ణయాలు.. అలాంటి పరిస్థితుల్లో 9 మందితోనే బరిలోకి.. ఎందుకో తెలుసా?

ICC మహిళల ప్రపంచ కప్ 2022 మార్చి 4 నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా ఉమెన్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 6న పాకిస్తాన్‌తో ఆడనుంది.

Venkata Chari
|

Updated on: Feb 24, 2022 | 2:32 PM

Share
కరోనా వైరస్ కారణంగా చాలా నిబంధనలు మారిపోయాయి. ఆటగాళ్లను బయో బబుల్స్‌లో ఉంచుతున్నారు, బంతి బౌండరీ లైన్ వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేసుకోవాలనే నిబంధనలు రూపొందించారు. ఒక ప్లేయర్‌కు కరోనా ఉంటే, ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్న ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయినా ఆటను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుం ICC మహిళల ప్రపంచ కప్ 2022 కోసం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో మైదానంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. (PC-WHITEFERNS)

కరోనా వైరస్ కారణంగా చాలా నిబంధనలు మారిపోయాయి. ఆటగాళ్లను బయో బబుల్స్‌లో ఉంచుతున్నారు, బంతి బౌండరీ లైన్ వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేసుకోవాలనే నిబంధనలు రూపొందించారు. ఒక ప్లేయర్‌కు కరోనా ఉంటే, ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్న ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయినా ఆటను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుం ICC మహిళల ప్రపంచ కప్ 2022 కోసం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో మైదానంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. (PC-WHITEFERNS)

1 / 5
రంజీ ట్రోఫీకి కూడా ఇదే నిబంధన.. రంజీ ట్రోఫీకి కూడా ఇదే నిబంధనను రూపొందించిన బీసీసీఐ స్ఫూర్తితో.. ఐసీసీ ఈ రూల్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల అండర్-19 ప్రపంచ కప్ సందర్భంగా, టీమ్ ఇండియాతో సహా అనేక జట్లలో కరోనా కేసులు నమోదయిన విషయం తెలిసిందే. జట్టులో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత, ప్లేయింగ్ ఎలెవన్‌ను ల్యాండ్ చేయడంలో భారత్ కూడా ఇబ్బంది పడింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చూసి ప్రస్తుతం 11 మందితో కాకుండా 9 మందితో ఆట కొనసాగించాలని ఐసీసీ నిబంధన విధించింది. (PC-WHITEFERNS)

రంజీ ట్రోఫీకి కూడా ఇదే నిబంధన.. రంజీ ట్రోఫీకి కూడా ఇదే నిబంధనను రూపొందించిన బీసీసీఐ స్ఫూర్తితో.. ఐసీసీ ఈ రూల్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల అండర్-19 ప్రపంచ కప్ సందర్భంగా, టీమ్ ఇండియాతో సహా అనేక జట్లలో కరోనా కేసులు నమోదయిన విషయం తెలిసిందే. జట్టులో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత, ప్లేయింగ్ ఎలెవన్‌ను ల్యాండ్ చేయడంలో భారత్ కూడా ఇబ్బంది పడింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చూసి ప్రస్తుతం 11 మందితో కాకుండా 9 మందితో ఆట కొనసాగించాలని ఐసీసీ నిబంధన విధించింది. (PC-WHITEFERNS)

2 / 5
ICC మహిళల ప్రపంచ కప్ 2022 మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమవుతుంది. బే ఓవల్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు మార్చి 6న పాకిస్థాన్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. (PC-WHITEFERNS)

ICC మహిళల ప్రపంచ కప్ 2022 మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమవుతుంది. బే ఓవల్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు మార్చి 6న పాకిస్థాన్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. (PC-WHITEFERNS)

3 / 5
మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. (PC-WHITEFERNS)

మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. (PC-WHITEFERNS)

4 / 5
భారత ప్రపంచకప్ జట్టు- మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ . (PC-WHITEFERNS)

భారత ప్రపంచకప్ జట్టు- మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ . (PC-WHITEFERNS)

5 / 5
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి