
Cricket Records: ప్రపంచ క్రికెట్లో గొప్ప బ్యాట్స్మెన్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 82 సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 34357 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 27599 పరుగులు చేశాడు. అయితే, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ తమ మొత్తం కెరీర్లో సాధించలేని ఓ స్పెషల్ రికార్డు ఒకటి ఉంది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో, కేవలం నలుగురు బ్యాట్స్మెన్స్ మాత్రమే రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించగలిగారు. ఈ నలుగురు తుఫాన్ బ్యాట్స్మెన్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లు లేవు. ఇప్పటివరకు, టెస్ట్ క్రికెట్ చరిత్రలో నలుగురు బ్యాటర్లు మాత్రమే ఈ రికార్డును సాధించగలిగారు.

4. డాన్ బ్రాడ్మాన్: దిగ్గజ బ్యాట్స్మన్ డాన్ బ్రాడ్మాన్ కూడా తన టెస్ట్ కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. డాన్ బ్రాడ్మాన్ తన రెండు ట్రిపుల్ సెంచరీలను ఇంగ్లాండ్పైనే సాధించాడు. డాన్ బ్రాడ్మాన్ 1934లో ఇంగ్లాండ్పై 334 పరుగులు, 1930లో అదే జట్టుపై 304 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్మాన్ తన క్రికెట్ కెరీర్లో 52 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో డాన్ బ్రాడ్మాన్ బ్యాటింగ్ సగటు 99.94గా ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు.

3. క్రిస్ గేల్: క్రిస్ గేల్ టీ20 క్రికెట్ ప్రపంచంలో సిక్సర్ల రారాజు. క్రిస్ గేల్ రెడ్ బాల్ క్రికెట్లో కూడా తన బ్యాటింగ్ నైపుణ్యాలను చూపించాడు. 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో క్రిస్ గేల్ 317 పరుగులు చేశాడు. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో క్రిస్ గేల్ 333 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లీగ్లలో ఆడుతున్నాడు.

2. బ్రియాన్ లారా: బ్రియాన్ లారా ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా పేరుగాంచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రపంచ రికార్డు బ్రియాన్ లారా పేరిట ఉంది. బ్రియాన్ లారా 2004లో ఇంగ్లాండ్పై 400 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 1994లో కూడా లారా ఇంగ్లాండ్పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. లారా తన విస్ఫోటక ఇన్నింగ్స్కు ప్రసిద్ధి చెందాడు.

1. వీరేంద్ర సెహ్వాగ్: వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశంలోని ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లలో ఒకడిగా నిలిచారు. వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చాశాడు. అతను చాలా వేగంగా బ్యాటింగ్ చేసేవాడు. వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ను టీ20 క్రికెట్ లా ఆడేవాడు. 2004లో పాకిస్థాన్పై వీరేంద్ర సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ముల్తాన్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, 2008 సంవత్సరంలో చెన్నైలో, వీరేంద్ర సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై 319 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.