
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-19లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎక్కడ ఆడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. దీనికి ప్రధాన కారణం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉన్న పరిమితి.

ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్సీబీ అభిమానులు మరణించారు. ఈ విషాదం తర్వాత చిన్నస్వామి స్టేడియం మూసివేశారు. ఇప్పుడు, కర్ణాటక ప్రభుత్వం కొన్ని షరతులతో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, RCB ఫ్రాంచైజీ బెంగళూరులో పాల్గొనడాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఈ విషయంలో స్పష్టమైన సమాచారం అందించాలని BCCI రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని కోరింది. IPL షెడ్యూల్ను సిద్ధం చేసే ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ సొంత గ్రౌండ్ క్రికెట్ బోర్డుల నుండి NOC పొందాలి.

కానీ, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని ఇంకా ధృవీకరింలేదు. అందువల్ల, జనవరి 27 లోపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తన హోమ్ గ్రౌండ్ గురించి తెలియజేయాలని BCCI గడువు విధించింది. అంటే వచ్చే మంగళవారం నాటికి RCB తన హోమ్ గ్రౌండ్ను నిర్ధారించాలి. చిన్నస్వామి స్టేడియంకు ప్రత్యామ్నాయంగా నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ క్రికెట్ స్టేడియంలో తన హోమ్ మ్యాచ్లను ఆడాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

చిన్నస్వామి స్టేడియంకు ప్రత్యామ్నాయంగా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ క్రికెట్ స్టేడియంలో తన హోమ్ మ్యాచ్లను ఆడాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.