
India vs England 2nd Test: ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు టీమిండియా కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 400+ పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడగా.. మరొకరు ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన ఆకాష్ దీప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ప్లేయర్లు చేయలేని ఘనతను ఆకాష్ దీప్ చేసి చూపించాడు. దీంతో ఏకంగా 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

ఆకాష్ దీప్ రెండు ఇన్నింగ్స్లలోనూ అద్భుతంగా రాణించాడు. అతను మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టాడు. అతను తన 8వ టెస్ట్లో 10 వికెట్లు పడగొట్టిన ఘనతను సాధించాడు. ఈ సమయంలో, ఆకాష్ దీప్ 187 పరుగులు ఇచ్చాడు.

ఇంగ్లాండ్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన భారత బ్యాట్స్మన్గా ఆకాష్ దీప్ నిలిచాడు. 1986లో ఇదే మైదానంలో 188 పరుగులకు 10 వికెట్లు తీసిన చేతన్ శర్మ రికార్డును అతను బద్దలు కొట్టాడు.

టీమిండియా వెటరన్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ లను కూడా ఆకాష్ దీప్ వెనక్కి నెట్టాడు. 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో ట్రెంట్ బ్రిడ్జ్లో బుమ్రా 110 పరుగులకు 9 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో రెండవ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, 2007లో జహీర్ ఖాన్ 134 పరుగులకు 9 వికెట్లు పడగొట్టాడు.

ఆకాష్ దీప్ సోదరి గత 2 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతోంది. ఈ రికార్డు ప్రదర్శన అతని సోదరికి అంకితమిచ్చాడు. అయితే, ఆమె పరిస్థితి మెరుగ్గా ఉంది. మ్యాచ్ తర్వాత ఆకాష్ దీప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తన సోదరిని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ ఆడానని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో భారత్ విదేశీ పిచ్లపై అతిపెద్ద విజయం సాధించిన రికార్డును సృష్టించింది. ఈ మ్యాచ్లో టీం ఇండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు, భారత్ 318 పరుగుల తేడాతో విజయం సాధించిన రికార్డును కలిగి ఉంది.