
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. వాళ్లు పదేళ్ళ తర్వాత కాదు.. పాతికేళ్ళ తర్వాత కలిసి సినిమా చేసినా ఆ క్రేజ్ ఎక్కడికీ పోదు. టాలీవుడ్లో అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ 20 ఏళ్ళ తర్వాత రిపీట్ కానుందని వార్తలొస్తున్నాయి.

మరి ఎవరా ఇంట్రెస్టింగ్ కాంబో..? గతంలో వాళ్లు కలిసి చేసిన సినిమాలేంటి..? నాగార్జున కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా శివమణి మాత్రం డిఫెరెంట్. అప్పటి వరకు ఉన్న నాగ్ ఇమేజ్ను పూర్తిగా మార్చేసిన సినిమా ఇది.

నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. అలాగే పూరీ, నాగ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ సినిమా యావరేజ్గానే ఆడినా.. అందులో నాగార్జున లుక్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

ఆ సినిమాతో పదేళ్ళు నా వయసు తగ్గిందంటూ ఎన్నోసార్లు చెప్పారు నాగ్. 20 ఏళ్ళ కిందే హాలీవుడ్ మేకింగ్ ఈ సినిమాలో చూపించారు పూరీ. ఇక శివమణి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ నాగార్జునతో సినిమా కోసం పూరీ ట్రై చేస్తున్నారని తెలుస్తుంది

నా సామిరంగ తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు నాగార్జున. ధనుష్ కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ షూట్ చివరి దశకు రావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్ను ఒప్పించే పనిలో ఉన్నారు పూరీ జగన్నాథ్. ఈ కాంబో కలవాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. అయితే అది డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్పైనే ఆధారపడి ఉండొచ్చు.