
అందుకోసం ఆయన కొన్నాళ్ల పాటు మేకోవర్ టైమ్ తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్. కూలీ షూటింగ్ పూర్తి కాగానే, ఇమీడియేట్గా జైలర్2 సెట్స్ కి వెళ్లడం లేదు.

రేపటి గురించి కలలు అలాగే మిగిలిపోతాయని బాగా తెలుసు సూపర్స్టార్కి. అందుకే పని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. జైలర్తో ఫుల్ పామ్లోకి వచ్చేశారు తలైవర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అటు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్కి కాల్షీట్ అలాట్ చేసేశారు. హుకుమ్ ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీగా ఉండమని సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఫస్టు పార్టుతో పోలిస్తే సెకండ్ పార్టులో మరింత స్టైలిష్గా కనిపిస్తారట సూపర్స్టార్.

తమ హీరో సినిమాతో పోలుస్తూ తలైవాను టార్గెట్ చేస్తున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ది గోట్ గత నెల ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా... వసూళ్లు పరంగా బిగ్ నెంబర్స్ కనిపించాయి.

తొలి వారం ది గోట్ 221 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నెంబర్స్ చూపిస్తూ రజనీ మూవీని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న టైమ్లో ఫ్యాన్స్, రజనీని టార్గెట్ చేయటం ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.