
మేడమ్ మేడమ్ అంటూ విజయ్ దేవరకొండ, చిర్రుబుర్రులాడుతూ రష్మిక మందన్న గీతగోవిందంలో పండించిన కెమిస్ట్రీని అంత తేలిగ్గా మర్చిపోలేరు ఆడియన్స్. ఇప్పటికీ గీతగోవిందం క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఆ తర్వాత చేసిన డియర కామ్రేడ్కి కూడా స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. డియర్ కామ్రేడ్ తర్వాతవీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగ ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ రానే వచ్చిందనే హింట్స్ అందుతున్నాయి.

విజయ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక నాయికగా నటిస్తారని గత కొన్నాళ్లుగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Hmm lets see... అంటూ పోస్ట్ పెట్టి రష్మికను ట్యాగ్ చేసింది ప్రొడక్షన్ హౌస్. ఓకే.. అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చేశారు రష్మిక. ఆ ఒక్క పోస్టుతోనే మాకంతా అర్థమైపోయిందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన కాంబో సెట్ అయిందని ఖుషీగా ఉన్నారు. రాహుల్ డైరక్షన్లో రష్మిక అండ్ విజయ్ సూపర్ కాంబో ఫిక్స్ అని విషయాన్ని వైరల్ చేస్తున్నారు.