మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్తో కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టార్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరుణ్.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు టైమ్ అస్సలు కలిసి రావటం లేదు. దాదాపు ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ యంగ్ హీరో. 2019లో రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్ వరుణ్ లాస్ట్ హిట్. ఆ తరువాత రకరకాల ప్రయోగాలు చేస్తున్నా... ఏ ఫార్ములా కూడా వరుణ్ను సక్సెస్ ట్రాక్లోకి తీసుకురాలేకపోయింది.
గద్దలకొండ గణేష్ తరువాత ఐదు సినిమాలు చేశారు వరుణ్. కామెడీ, స్పోర్ట్స్ డ్రామా, స్పై యాక్షన్, ఏరియల్ యాక్షన్, పీరియాడిక్ ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. కానీ ఏ జానర్లోనూ హిట్ రాలేదు. వరుస ఫెయిల్యూర్స్తో కెరీర్ మరింత కష్టాల్లో పడింది.
గని సినిమాతో మొదలైన బ్యాడ్ టైమ్ వరుణ్కి అలాగే కంటిన్యూ అవుతోంది. హిట్ ఫార్ములాతో వచ్చిన ఎఫ్ 3 కూడా నిరాశపరిచింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్గా తెరకెక్కిన గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు మినిమమ్ బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.
రీసెంట్గా మాట్కా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు వరుణ్. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి ఆడియన్స్ను మెప్పించే కథతోనే థియేటర్లలోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.