
మీరు కడుపుకి అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా..? అమ్మాయిలకు బిస్కెట్ వేయాలంటే ఇదిగో ఇలాంటి పద ప్రయోగాలు తప్పదు. కానీ ఇండస్ట్రీలో కొందరు 40 ప్లస్ హీరోయిన్స్ను చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎక్స్పోజింగ్తో మతులు పోగొట్టే ఈ తరం హీరోయిన్లకు.. తమ అందంతో మతులు చెడగొడుతున్నారు సీనియర్లు. మరి వాళ్లెవరో తెలుసా..?

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఫేజ్లో ఉన్నారు చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ కెరీర్లో మంచి ఫామ్ చూపిస్తున్నారు.

ఇన్నేళ్ల తరువాత మళ్లీ నార్త్ వైపు చూస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావటంతో నార్త్ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారట త్రిషా కృష్ణన్. ప్రజెంట్ ముగురుదాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్,

1995లోనే హీరోయిన్ అయ్యారీమే. అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్గా నటిస్తున్నారు మంజు వారియర్. తాజాగా రజినీ వేట్టయన్లోనూ ఉన్నారీమే. పాటలో రజినీ ఉన్నా.. మంజు వారియర్నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు 46 ఏళ్ళ మంజు. నయనతార కూడా 40కి చేరువలోనే ఉన్నారు. ఈమె క్రేజ్లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్లకు లేదు. ఇక 42 ఏళ్ళ వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాజిక్ చేస్తున్నారు. అందుకే మరి వీళ్లను అందం తింటున్నారా అని అడిగేది..!