
2024 సంక్రాంతి సినిమాల మత్తే ఇంకా దిగలేదు.. మూడు నాలుగు రోజులుగా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్నాయి. అంతలోనే 2025 సంక్రాంతి గురించి చర్చ మొదలైపోయింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుందిప్పుడు. చిరంజీవితో పాటు మరో ముగ్గురు హీరోలు వచ్చే ఏడాది పండగకు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు.

ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు పండక్కి వచ్చి దుమ్ము దులిపేయడంతో.. సంక్రాంతిని సెంటిమెంట్గా భావిస్తున్నారు చిరు. అందుకే సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభరను 2025 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు అన్నయ్య. చిరంజీవి చేసిన లాస్ట్ సోషియో ఫాంటసీ అంజి కూడా 2004 సంక్రాంతికే విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు అదే పండక్కి రానున్నారు మెగాస్టార్.ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు పండక్కి వచ్చి దుమ్ము దులిపేయడంతో.. సంక్రాంతిని సెంటిమెంట్గా భావిస్తున్నారు చిరు. అందుకే సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభరను 2025 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు అన్నయ్య. చిరంజీవి చేసిన లాస్ట్ సోషియో ఫాంటసీ అంజి కూడా 2004 సంక్రాంతికే విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు అదే పండక్కి రానున్నారు మెగాస్టార్.

హనుమాన్ సీక్వెల్ సైతం 2025 సంక్రాంతికే రానుంది. జై హనుమాన్ పేరుతో ఈ సినిమా రానుందని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. హనుమంతుడు శ్రీరాముడికిచ్చిన మాట నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పారు ప్రశాంత్ వర్మ.

పండక్కి వచ్చి హిట్ కొట్టడం అలవాటుగా చేసుకున్న నాగార్జున.. 2025 సంక్రాంతికి బంగార్రాజు 2 తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్లో సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు బాగానే ఆడాయి. అదే దారిలో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.

వీళ్ళతో పాటు బాలయ్య సైతం ఓ సినిమాను వచ్చే సంక్రాంతికి సిద్ధం చేస్తారని తెలుస్తుంది. ఈ లెక్కన ఏడాది ముందే సంక్రాంతి హౌజ్ ఫుల్ అన్నమాట. ఇక శతమానం భవతి 2 సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందని కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.