
ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్ మరికొన్ని గంట్లలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఫుల్ అయ్యాయి.

మొదటిసారి పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తుండడం.. అది కూడా రాముడి పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

ఇందులో జానకిగా కృతిసనన్ నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సీతగా తన లుక్ ఆకట్టుకుంది. ఇక రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను దాదాపు రూ.600 బడ్జెట్ తో నిర్మించడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 9000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్ లో 3500 స్క్రీన్స్ ఈ సినిమాకు కేటాయించారు.

సినీచరిత్రలో ఎప్పుడూ లేనివిదంగా ఈ సినిమా టికెట్స్ వేల సంఖ్యలో సినీ సెలబ్రెటీలు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఆదిపురుష్ విడుదలయ్యే ప్రతి థియేటర్లో హనుమంతుడికి ఓ సీట్ కేటాయించారు.

తెలుగు మినహా.. మిగతా అన్ని భాషల్లో ఆదిపురుష్ నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో టికెట్స్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్న అడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.