
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అదే రోజు రావడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే సలార్ నవంబర్ 10న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదలైంది. రెండో రోజు ఈ సినిమాకు 112 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజుల్లో 240 కోట్ల వరకు వసూలు చేసింది జవాన్. కేవలం తెలుగులోనే 2 డేస్లో 16 కోట్ల గ్రాస్ వచ్చింది. బాలీవుడ్లో మొదటి రోజు 65 కోట్ల నెట్.. రెండో రోజు 47 కోట్లు వచ్చాయి. పఠాన్ తర్వాత మరోసారి 1000 కోట్లపై కన్నేసారు కింగ్ ఖాన్.

వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదికేశవ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలైంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

రాజన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి అనీ. ఈమె హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా తికమకతాండ. ఇందలో కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్తో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి తోపులే వీళ్లు అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఫలితంతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు హీరో గోపీచంద్. తాజాగా దర్శకుడు శ్రీను వైట్లతో ఈయన సినిమా ఓపెనింగ్ జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ముహూర్తానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ ఈ సినిమాలో కొత్త లుక్కుతో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.