
2023లో రిలీజ్ అయిన ఖుషి సినిమా తరువాత మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో మూవీ ఎనౌన్స్ చేసినా అది సెట్స్ మీదకు రాలేదు.

దీంతో సమంత ఎందుకిలా చేస్తున్నారన్న డిస్కషన్ మొదలైంది. ఫైనల్గా బ్రేక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు సామ్. కెరీర్ స్టార్టింగ్లో సినిమాలే జీవితంగా పనిచేసిన సామ్, ఇప్పుడు కెరీర్తో పాటు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు.

అందుకే సినిమాలు బాగా తగ్గించినట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసిన సామ్ ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీదే ఉందని, ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయనని చెప్పారు.

తక్కువ సినిమాలు చేసినా... ప్రేక్షకులను మెప్పించే ప్రాజెక్ట్సే అంగీకరిస్తానంటున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సామ్.

ఆన్లైన్ నెగెటివిటీని మనం కంట్రోల్ చేయాలి గానీ, అది మనల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రజెంట్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మండ్లో నటిస్తున్నారు సామ్.