
అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అన్నిచోట్లా ఈమె ట్రెండింగ్ ఇప్పుడు. ఉన్నట్లుండి సాయి పల్లవి ఈ రేంజ్లో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి..?

ఆ మధ్య సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి.. ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ జెండా పాతేస్తున్నారు ఈ బ్యూటీ.

తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూతో ఈమె నటిస్తున్న రెండో సినిమా ఇది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్లో నటిస్తున్నారు.

ఈ చిత్ర డబ్బింగ్ ముంబైలోనే చెప్తున్నారు సాయి పల్లవి. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి. ఇప్పటికే అక్కడ అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. రణ్బీర్ కపూర్ రామాయణలోనూ సీతమ్మగానూ నటిస్తున్నారు.

ట్రెండింగ్ అంటే మాకిష్టం.. నేను ట్రెండింగ్ మంచి ఫ్రెండ్స్.. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ అవ్వడం.. వైరల్ అవ్వడం ఎలాగో నాకు తెలుసు.! ఇండస్ట్రీలో ఓ హీరోయిన్కు ఈ మాటలు బాగా సరిపోతాయి.