
సాయిపల్లవి, రష్మిక మందన్న ఇప్పుడు ఒకటే సిట్చువేషన్లో ఉన్నారు. ఇప్పటికైతే ఇద్దరూ ఈ డిసెంబర్లో ప్రేక్షకులను పలకరించాలి. మరి ఆ ముచ్చట ఉందా? లేదా? ఒకవేళ ఉన్నా లేకున్నా, వచ్చే ఏడాదిని ఎవరెలా ప్లాన్ చేసుకున్నారు... ఇంట్రస్టింగ్గా ఉంది... ఇద్దరి ఫిల్మోగ్రఫీ....

తెలుగులో విరాటపర్వం తర్వాత సినిమానే చేయలేదు సాయిపల్లవి. ఆ తర్వాత గార్గిలో కనిపించినా, అది డబ్బింగ్ సినిమానే. 2022 తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నో ఆన్సర్. పోనీ, పొరుగు భాషల్లో తీరిక లేకుండా ఉన్నారా? అంటే అలాంటిదేమీ లేదు. అక్కడా రిలీజులు కనిపించడం లేదు. ఆల్రెడీ చేస్తున్న తమిళ అమరన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తండేల్ ఈ ఏడాది డిసెంబర్లో ఉంటుందా? అంటే ఇప్పటికీ డౌటే.

ఈ ఏడాది డిసెంబర్ మీద పెద్ద ఖర్చీఫులు పడుతుండటంతో తండేల్ రిలీజ్ మీద అనుమానాలు కనిపిస్తున్నాయి. అవే నిజమయి తండేల్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయితే 2025లో పల్లవి ఖాతాలో ఏకంగా నాలుగు రిలీజులున్నట్టు.

పుష్ప2 షూటింగులో తన పార్టును వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప2 తో పాటు సైమల్టైనియస్గా కుబేర షూట్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ.

అలా చేస్తేనే.. ఆమె వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ షెడ్యూల్ని క్యాచ్ చేయగలుగుతారు. అక్టోబర్లో ఈ సినిమా షూట్ మొదలవుతుంది. అక్టోబర్ థర్డ్ వీక్లో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా షూట్లో జాయిన్ అవుతారు.