సాయిపల్లవి, రష్మిక మందన్న ఇప్పుడు ఒకటే సిట్చువేషన్లో ఉన్నారు. ఇప్పటికైతే ఇద్దరూ ఈ డిసెంబర్లో ప్రేక్షకులను పలకరించాలి. మరి ఆ ముచ్చట ఉందా? లేదా? ఒకవేళ ఉన్నా లేకున్నా, వచ్చే ఏడాదిని ఎవరెలా ప్లాన్ చేసుకున్నారు... ఇంట్రస్టింగ్గా ఉంది... ఇద్దరి ఫిల్మోగ్రఫీ....
తెలుగులో విరాటపర్వం తర్వాత సినిమానే చేయలేదు సాయిపల్లవి. ఆ తర్వాత గార్గిలో కనిపించినా, అది డబ్బింగ్ సినిమానే. 2022 తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నో ఆన్సర్. పోనీ, పొరుగు భాషల్లో తీరిక లేకుండా ఉన్నారా? అంటే అలాంటిదేమీ లేదు. అక్కడా రిలీజులు కనిపించడం లేదు. ఆల్రెడీ చేస్తున్న తమిళ అమరన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తండేల్ ఈ ఏడాది డిసెంబర్లో ఉంటుందా? అంటే ఇప్పటికీ డౌటే.
ఈ ఏడాది డిసెంబర్ మీద పెద్ద ఖర్చీఫులు పడుతుండటంతో తండేల్ రిలీజ్ మీద అనుమానాలు కనిపిస్తున్నాయి. అవే నిజమయి తండేల్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయితే 2025లో పల్లవి ఖాతాలో ఏకంగా నాలుగు రిలీజులున్నట్టు.
అమరన్, తండేల్, నార్త్ రామాయణం, ఆమీర్ఖాన్ కొడుకుతో చేస్తున్న సినిమా... వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా పల్లవి ఫ్యూచర్కి అసలేం ఢోకా లేదు. మరి లాస్ట్ డిసెంబర్లో యానిమల్తో హల్చల్ చేసిన రష్మిక సంగతేంటి?
ఈ ఏడాది డిసెంబర్కి పుష్ప2 ఉంటేనే, రష్మిక ఖాతాలో 2024లో ఒక్క సినిమా అయినా రిజిస్టర్ అయ్యేది. ఫిల్మోగ్రఫీలో ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నట్టుగా ఆరు పేర్లు కనిపిస్తున్నా... అవన్నీ 2025లోనే రిలీజ్ అయ్యే సూచనలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఈ డిసెంబర్ పల్లవికి ఎంత ఇంపార్టెంటో, రష్మికకు కూడా అంతే కీలకం అన్నమాట.