
రీసెంట్ అప్కమింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు రాకీభాయ్ యష్. టాక్సిక్ పేరుతో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన యష్ వెంటనే సైలెంట్ అయ్యారు. మరి బర్త్ డే రోజైనా ఫ్యాన్స్కు నెక్ట్స్ అప్డేట్ ఇస్తారా..? లేదంటే ఈ సైలెన్స్ ఇలాగే మెయిన్టైన్ చేస్తారా..?

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తరువాత యష్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అందుకే ఆ రేంజ్ సినిమానే చేయాలన్న ఉద్దేశంతో నెక్ట్స్ మూవీని ఫైనల్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు రాకీభాయ్. కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ తరువాత చాలా రోజులు మీడియాకు దూరంగా ఉండిపోయిన రాకీభాయ్ రీసెంట్గా తన నైన్టీన్త్ మూవీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. మూవీ ఎనౌన్స్మెంట్ తరువాత మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు రాకీభాయ్.

దీంతో జనవరి 8న బర్త్ డే సందర్భంగా షూటింగ్ అప్డేట్, కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ రివీల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఆ ఆశల మీద నీళ్లు చల్లేశారు రాకీభాయ్.

కేజీఎఫ్ రిలీజ్ తరువాత ప్రతీ బర్త్డేను మీడియాకు ఫ్యాన్స్కు దూరంగా సెలబ్రేట్ చేసుకుంటున్న యష్, ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు.

యష్ ఎలాగూ అందుబాటులో ఉండరు కాబట్టి.. టాక్సిక్ అప్డేట్ కూడా ఉండదని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.