
త శుక్రవారం (ఆగస్టు 25) వరమహాలక్ష్మి పండుగను అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పండుగ పూట ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాంతారా హీరో రిషబ్ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి పండగను అత్యంత ఘనంగా జరుపుకొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అతని సతీమణి ప్రగతి శెట్టి, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.

'గత శుక్రవారం నాడు వరమహాలక్ష్మి పండుగ జరుపుకున్నఆనంద క్షణాలు. ఆ తల్లి అందరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక' అని ప్రగతిశెట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇంట్లో వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.

రిషబ్ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా కుమారుడు రన్విత్ శెట్టి, కూతురు రాధ ఫొటోస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కాంతారా' 2022లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు రిషబే దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ను రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్.