రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉంది. ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.
సినిమాలతో పాటు గ్లామరస్ ఫోటోషూట్లతోనూ బిజీగా ఉంటోంది రష్మిక. తాజాగా ఆమెకు ఓ పాపులర్ మ్యాగజైన్ కోసం సముద్ర తీరంలో ఒక ఫొటోషూట్ చేసింది.
ఈ ఫొటోషూట్ కోసం రష్మిక మందన్న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్కడి అందమైన బీచుల్లో కెమెరాలకు పోజులిచ్చింది. అనంతర ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్మిక బీచ్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షలాది లైకులు, క్రేజీ కామెంట్లు వచ్చాయి.
రష్మిక మందన్నఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం విశేషం. దీంతో పాటు కుబేర, పుష్ప2 వంటి క్రేజీ సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి.