
టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజులుగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ.

తెలుగులో చివరగా కొండపొలం మూవీలో కనిపించిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

బీటౌన్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా థియేటర్స్… ఓటీటీల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హంగామాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్.. తన అభిరుచులు..కంటెంట్ గురించి తెలిపింది.

తాను సినిమాలను తీయడానికి పడిన శ్రమ ఎలా ఉంటుందో తనకు తెలుసునని.. అందుకే థియేటర్లలో మూవీ చేసేందుకు ఇష్టపడతానని తెలిపింది.

అలాగే ఓటీటీ కంటెంట్ గురించి స్పందిస్తూ.. “నాకు థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ వినోదాత్మకమైన కంటెంట్ ను థియేటర్లో చూడాలని ఉంటుంది. నిజానికి నేను థియేటర్ లో సినిమా చూడాలనుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.

థియేటర్కు వచ్చే ప్రతి సినిమాను చూడాలని కాదు. కానీ సాధ్యమైనంతవరకు కొన్ని సినిమాలను థియేటర్లో చూసేందుకు ఇష్టపడతాను. ఇంట్లో ఉండి ఎంత గొప్ప సినిమా చూసిన అది థియేటర్ స్క్రీన్ కు సాటి రాదు.

నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా.. ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. సినిమా కోసం నటీనటులు తక్కువగా పనిచేస్తారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లైన్ మెన్ వరకు దాదాపు 14 -15 గంటలు అక్కడే వర్క్ చేస్తారు. వాళ్ల కోసమే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నాను అని తెలిపింది.