
అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు డాలీ ధనంజయ్. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో డాలీ బాగా ఆకట్టుకున్నాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ త్వరలోనే ధన్యత అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 16న మైసూర్లో వీరి వివాహం జరగనుంది.

ఈ నేపథ్యంలో డాలీ ధనంజయ అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా కలిసి తన వివాహ ఆహ్వానం పత్రికను అందజేశాడు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ను కూడా కలిసి తన వివాహ వేడుకకు ఆహ్వానించాడు.

అలాగే నటి రష్మిక మందన్నా, పుష్ప నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ను కూడా కలిశాడు డాలీ. తన పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించాడు

కాగా గతేడాది నవంబర్ 17న డాలీ ధనుంజయ, ధన్యతల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు.

డాలీ ధనంజయ్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక ధన్యత విషయానికి వస్తే ఆమె వృత్తిరీత్యా డాక్టర్.