
టాలీవుడ్ లో బాపు బొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రణీత శుభాష్. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏం పిల్లో ఏం పిల్లోడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత బావ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే ప్రణీత సుభాష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆఫర్స్ కూడా అందుకుంది ఈ భామ. హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేదు.

ప్రణీత నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడు. సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో.. అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిన ప్రణీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ప్రణీత సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫొటోల్లో ప్రణీత నిజంగా బాపు బొమ్మలా మెరిసింది.