పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగింది సంగతి తెలిసిందే. ఇక పవన్ గెలుపుతో అది తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సినిమా వాళ్ల పిఠాపురం వైపు వెళ్లింది. తాజగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించింది.
శనివారం ఉదయం డిప్యూటీ సీఎం నియోజకవర్గం పిఠాపురానికి మెగా డాటర్ నిహారిక వెళ్లింది. అక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆలయాధికారులు నిహారికను ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది మెగా డాటర్.
నిహారిక వెంట కమిటీ కుర్రాళ్ళు చిత్ర బృందం కూడా ఉంది. ఈ సినిమా ఆగస్టు 9 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పిఠాపురం వెళ్ళింది నిహారిక.
పవన్ గెలిచాక మొదటిసారి నిహారిక పిఠాపురం రావడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆమెని చూడటానికి, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.