
దక్షిణాది హీరోయిన్లలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. అంతేకాకుండా సహజ నటన, అందంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా ఆమె కావడం విశేషం.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరనస మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో నయన్ శశిరేఖ పాత్రలో కనిపించనుంది.

అయితే తన సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్.. చిరు మూవీ కోసం తన రూల్ బ్రేక్ చేసింది. మన శంకరవరప్రసాద్ గారు సినిమా షూటింగ్ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా క్రేజీ వీడియోస్ షేర్ చేస్తుంది. అలాగే ఇందులో ఆమె లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీకి ఆమె భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. నివేదికల ప్రకారం మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయన్ ఏకంగా రూ.5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

ఇటీవల షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి ఆమె దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం నయన్ సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. అలాగే తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.