
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేసారు. ఈ మేరకు హరి హర వీరమల్లు టీమ్ కొత్త పోస్టర్తో ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. సురేందర్ రెడ్డి కాంబినేషన్లో పవన్ చేయబోయే సినిమా ఆఫీస్ను లాంచనంగా ప్రారంభించారు నిర్మాతలు. ఓజీ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దేశవ్యాప్తంగా జవాన్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తొలి రోజు నేషనల్ లెవల్లో లక్షా 38 వేల టికెట్స్ బుక్ అయినట్టుగా వెల్లడించారు మేకర్స్.

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకోన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లీడ్ రోల్స్లో నటించారు. పఠాన్ బ్లాక్ బూస్టర్ తర్వాత షారూఖ్ కనిపించనున్న చిత్రమిది.

లియో సినిమాకు నో చెప్పటంపై క్లారిటీ ఇచ్చారు హీరో విశాల్. ఈ సినిమాలో విజయ్ తమ్ముడి పాత్రకు విశాల్ను సంప్రదించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ పాత్రకు విశాల్ నో చెప్పారు.

తరువాత అదే క్యారెక్టర్ను విజయ్కి అన్నగా మార్చి అర్జున్ను తీసుకున్నారు డైరెక్టర్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాంతార సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రిషబ్ శెట్టికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రజెంట్ కాంతార ప్రీక్వెల్ వర్క్లో బిజీగా ఉన్న రిషబ్ను ఓ బాలీవుడ్ దర్శకుడు సంప్రదించారు. జోదా అక్బర్ లాంటి క్లాసిక్ సినిమాను రూపొందించిన అశుతోష్ గోవరికర్, తన నెక్ట్స్ సినిమాలో రిషబ్ను కీ రోల్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు.