
మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ను ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్ ఫామ్లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మాలీవుడ్ స్క్రీన్ మీద భారీ మల్టీస్టారర్కు రంగం సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. గతంలో 50కి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్స్.

కానీ 2008లో రిలీజ్ అయిన ట్వంటీ - ట్వంటీ తరువాత ఈ కాంబో రిపీట్ కాలేదు. పదహారేళ్ల తరువాత మెగా కాంబోను తెర మీదకు తీసుకువచ్చే పనుల్లో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్.

మలయాళంలో మాలిక్, మనోరథాంగళ్ లాంటి ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ను రూపొందించిన మహేష్, ఇప్పుడు మరో బిగ్ కాన్వాస్ను సిద్ధం చేస్తున్నారు.

మమ్ముట్టి, మోహన్లాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రజెంట్ మాలీవుడ్లో సూపర్ ఫామ్లో ఉన్న కుంచుకో బొబన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇలా టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో మాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటున్నారు క్రిటిక్స్.