
15 డిసెంబర్ 1992న కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇడుక్కి జన్మించింది అందాల భామ మిర్న మీనన్. ఈ వయ్యారి సయన సంతోష్, అదితి మీనన్ అనే మరో రెండు పేరు కూడా ఉన్నాయి. మొదటి రెండు సినిమాల్లో అదితి మీనన్ అనే ఉంటుంది.

కేరళలోని ఇడుక్కిలోని రామకల్మేడులో ఉన్న సేక్రేడ్ హార్ట్ హైస్కూల్లో తన స్కూలింగ్ పూర్తి చేసింది ఈ బ్యూటీ. తమిళనాడులోని చెన్నైలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది ఈ భామ.

మొదట్లో ఫ్రీలాన్స్ మోడల్గా కెరీర్ ప్రారంభించింది. కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంప్పై కూడా చేసింది. 2016లో పట్టతారి అనే తమిళ చిత్రంలో కథానాయకిగా చలన చిత్రం అరంగేట్రం చేసింది. ఇందులో ఈమె పేరు అదితి మీనన్గా ఉంది. 2022లో క్రేజీ ఫెలో అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.

2023లో అల్లరి నరేష్ కి జోడిగా యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం ఉగ్రంలో కనిపించింది. తర్వాత రజినికాంత్ జైలర్ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది ఈ అందాల భామ. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ ఏడాది మొదట్లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ చిత్రం నా సామిరంగా చిత్రంలో నరేష్ సరసన ఆకట్టుకుంది. తర్వాత బర్త్ మార్క్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.