పాలిటిక్స్ లైక్స్ మీ.. ఐ కాన్ట్ అవాయిడ్.. ఇప్పుడు ఈ డైలాగ్ చిరంజీవికి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తుంది. లేకపోతే మరేంటి.. రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. అది అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా పద్మ విభూషణ్ వేడుకలో మరోసారి చిరు కామెంట్స్ పొటిలికల్ గ్రౌండ్లో కాక పుట్టిస్తున్నాయి.
టైమ్ వేస్ట్ వద్దు.. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం.. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ రచ్చ లేపింది. అమ్మో అన్నయ్య మళ్లీ పాలిటిక్స్ వైపు వస్తున్నారో ఏమో అని అభిమానుల కాస్త కంగారు పడ్డారు కూడా. అయితే తన పొలిటికల్ కెరీర్ అయిపోయిందని.. ఇక లైఫ్ అంతా సినిమాలే అని చెప్పారు మెగాస్టార్.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మరోసారి సెటైర్లు పేల్చారు చిరు. వింటున్నారుగా.. పద్మ విభూషణ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్. ఈ మధ్య పాలిటిక్స్ మరీ దారుణంగా మారిపోయాయని.. సమస్యల కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయని స్ట్రెయిట్గా మ్యాటర్లోకి వచ్చేసారు మెగాస్టార్.
అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలంటూ చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చిరు మద్దతునిచ్చారు.
చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు.. గతేడాది వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్లోనూ మాటలతో హీట్ పుట్టించారు మెగాస్టార్. అభివృద్ధిపై ఫోకస్ పెడితే బాగుంటుంది.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారంటూ చిరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను ఇంటికి పంపించాలని ప్రజలకు సూచించారు చిరంజీవి. పైకి చెప్పకపోయినా.. తమ్ముడు పవన్ను అలా దూషిస్తున్న వాళ్లపై చిరు సెటైర్ వేసారని అర్థమవుతుంది.
మొత్తానికి చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా.. ఉండనివ్వరు.. ఆయన కూడా ఉండలేరని అర్థమవుతుంది. పాలిటిక్స్ పక్కనబెడితే.. ఈయన ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు.