
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించాలని ఈ మధ్య ముద్దుగుమ్మలంతా తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి అలంటి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు.?

సమంత.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సామ్ నటించిన శాకుంతలం, ఖుషీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

ఇక రష్మిక మందన్న సైతం టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చేసారు. పుష్ప 2 మినహా.. ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు. రష్మిక చూపులన్నీ బాలీవుడ్పైనే ఉన్నాయి. అక్కడే వరస సినిమాలు చేస్తున్నారు. దాంతో టాలీవుడ్ నెం.1 హీరోయిన్ రేసులో నుంచి రష్మిక బయటికి వచ్చేసినట్లే..

పూజ హెగ్డే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది. ఆ అమ్మడు కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.

ఇక కీర్తిసురేష్ విషయానికొస్తే.. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ చిన్నది. ఇప్పుడు టాలీవుడ్ ఫ్యావరెట్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతోనూ సినిమాలు చేస్తోంది.

వీళ్లకు పోటీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ కూడా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ సీ 15లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే సీతారామం సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. ఈ చిన్నది తెలుగు లో నటించిన ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఏ స్టార్ తో సినిమా చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.