
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కో సీఈవో టెడ్ సరాండొస్, తన టీంతో కలిసి ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నివాసంలో సందడి చేశారు.

ఇక ఈరోజు శుక్రవారం ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ కో సీఈవో బృందానికి తారక్ తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు.

భోజనం అనంతరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు ఎన్టీఆర్.

మీకు.. మీ బృందానికి విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని.. సినిమా, ఫుడ్ కు సంబంధించిన విషయాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు.

ఈ విందులో కొరటాల శివ, కళ్యాణ్ రామ్ సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. ఏదైన ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తారా ? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.