
నెమ్మదిగా బాలీవుడ్ను కమ్మేస్తున్నారు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్. పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ కమర్షియల్ సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.గ్లామర్ ఇమేజ్తో పాటు నటిగానూ మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్, తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఎప్పటి నుంచో ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదన్న ఈ బ్యూటీ, దేవరతో ఆ కోరిక తీరబోతోందని చెప్పారు.ఎన్టీఆర్తో పాటు రణబీర్ కపూర్తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు జాన్వీ.

సినిమాల్లోకి ఎంట్రీకి ఇవ్వకముందు నుంచే రణబీర్కు అభిమానిని అన్న జూనియర్ శ్రీదేవి, త్వరలోనే రణబీర్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చారు. హృతిక్, టైగర్లతోనూ కలిసి నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట ఈ బ్యూటీ.

దర్శకుల విషయంలోనూ తన ఇంట్రస్ట్ల గురించి చెప్పారు జాన్వీ కపూర్. కెరీర్ స్టార్టింగ్లోనే చాలా మంది గ్రేట్ డైరెక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ రావటం ఆనందంగా ఉందన్న జాన్వీ, తను వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ కూడా భారీగా ఉందన్నారు.

క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, స్టార్ మేకర్ కరణ్ జోహర్ సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు. కరణ్ సినిమాలో ఇప్పటికే జాన్వీ నటించాల్సి ఉంది. కోవిడ్కు ముందు తక్త్ అనే సినిమాను ఎనౌన్స్ చేశారు కరణ్. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కరణ్ కాంపౌండ్లో మరో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు జాన్వీ కపూర్.