జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, నటుడు యాదమ్మ రాజు- స్టెల్లా దంపతులకు గతేడాది డిసెంబర్ లో పండంటి ఆడ బిడ్డ జన్మించింది.
తమ కూతురి ఆలనా పాలనలో బిజీగా ఉంటోన్న ఈ జంట కొద్ది రోజల క్రితం తమ బిడ్డకు గిఫ్టీ అని నిక్నేమ్ పెట్టుకున్నారు.
తాజాగా గిఫ్టీకి ఊయల వేడుకతో పాటు నామకరణం ఫంక్షన్ నిర్వహించారు యాదమ్మ రాజు దంపతులు. ఈ సందర్భంగా గిఫ్టీని ఊయలలో వేసి జనిస్సా రాజ్ అని పేరు పెట్టారు.
క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ నామకరణ మహోత్సవానికి పలువురు బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు.
బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్- తేజు దంపతులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు జబర్దస్త్ హరి తదితరులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు బుల్లితెర ప్రముుఖులు, అభిమానులు, నెటిజన్లు యాదమ్మరాజుకు విషెస్ చెబుతున్నారు