
తాప్సీ పన్ను ఇప్పుడు నార్త్ గర్ల్ గా చలామణి అయితే అవుతుండవచ్చు కానీ, ఇంతకు ముందు తాప్సీ అంటే సౌత్ అమ్మాయే. దక్షిణాదిన దాదాపుగా టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేశారు తాప్సీ.

నార్త్ లో సెటిలైన ఈ ఢిల్లీ గర్ల్ ఇటీవల షారుఖ్ఖాన్తో డంకీలో నటించారు. గత కొన్నేళ్లుగా ఆమె మథియాస్ బోతో రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ బాండింగ్ గురించి తాప్సీ మాట్లాడుతూ ''ఇప్పటికి పదేళ్లయింది మథియాస్ పరిచయమై.

అతనితో పరిచయం, ప్రేమ, జీవితం చాలా బావుంది. చాలా సంతోషంగా ఉన్నాను. నేను బాలీవుడ్లో అడుగుపెట్టిన రోజు నుంచే నాకు తనతో పరిచయం ఉంది" అని అన్నారు. 2013లో ఛష్మీ బద్దూర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు తాప్సీ పన్ను.

ఆ సినిమా సమయంలోనే మథియాస్ బో తో పరిచయం ఏర్పడిందట. ఈ విషయాన్నే చెబుతూ ''నేను మనస్ఫూర్తిగా తను కావాలనుకున్నాను. అతనికీ అలాంటి భావనే ఉంది. ఒకరికి ఒకరం నచ్చాం. అతనితో అంతా బావుంది.

తనతో పరిచయమైన రోజు నుంచి ఇప్పటిదాకా నా మనసులో ఇంకే ఆలోచనలూ లేవు. అతన్ని ఈ జీవితానికి వదిలే ప్రసక్తే లేదు'' అని అన్నారు. ప్రేమలో పడటానికి ముందు తనకున్న అనుమానాల గురించి కూడా ప్రస్తావించారు తాప్సీ.

''ఒక్కసారి సినిమాల్లోకి వచ్చాక, చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఎలాంటివారో అర్థం కాదు. ఎవరు మనల్ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలియదు. వారి ఇష్టానికి కారణాలు అడగలేం. మన మీద వాళ్లకున్న భావోద్వేగాలు వంద శాతం నిజమేనా? అనే అనుమానం ఎప్పటికప్పుడు కలుగుతూ ఉంటుంది.

ఇది నా ఒక్కదానికే ఉన్న ఇబ్బంది కాదు. నా చుట్టూ చాలా మంది తరచూ చర్చించుకునే టాపిక్ ఇది'' అని అన్నారు తాప్సీ. మరి అలాంటి ఆలోచనల నుంచి ఎలా బయటపడ్డారు అని అడిగితే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు తాప్సీ పన్ను.

''మనం ఒకరితో ఉన్నప్పుడు వారు చూపించే ప్రేమ, ఆదరణ గొప్పగా ఉండాలి. వారిని దాటి ఇంకొకరి మీదకు మన మనసు వెళ్లకూడదు. అలా వెళ్లిందంటే, ఇక్కడ మనం ఆనందంగా లేం అని అర్థం. నేను నా రిలేషన్షిప్ని ఎప్పుడూ దాచిపెట్టలేదు.

అలాగని జనాల్లో దాన్ని సెలబ్రేట్ చేయలేదు. నా మనసుకు నచ్చిన విధంగా జీవితాన్ని సాగిస్తున్నాను'' అని అన్నారు. తాప్సీ పన్ను ప్రస్తుతం ఓ లడ్కీ హై కహా, ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలతో బిజీగా ఉన్నారు.