2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార. నభానటేష్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది.
అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
తనకు యాక్సిడెంట్ కావడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానని.. అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయినట్లు తెలిపింది.
చాలా కాలం గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది నభా. అలాగే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది.
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్వయంబు మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో తిరిగి జాయిన్ అయ్యింది.